ఏపీ, ఒడిశా మధ్య నిలిచిపోయిన రాకపోకలు

53చూసినవారు
ఏపీ, ఒడిశా మధ్య నిలిచిపోయిన రాకపోకలు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి ఉపనది శబరికి వరదనీరు పోటెత్తుతోంది. భారీ వరద ప్రవాహంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు- కల్లేరు గ్రామాల మధ్య గండిపడి 316వ నెంబరు జాతీయ రహదారి కోతకుగురైంది. దీంతో ఆ మార్గంలో ఆంధ్రప్రదేశ్‌- ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్