ఏపీలోని నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుంకన్న (59), లక్ష్మీదేవి (44) దంపతులు. ఆర్థిక సమస్యలపై కొడుకుతో సుంకన్న-లక్ష్మీదేవి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన సుంకన్న-లక్ష్మీదేవి పురుగుల మందు తాగారు. దాంతో వారిని కుటుంబీకులు కర్నూలులోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు విడిచారు.