ఏపీలో పాఠశాలలకు ఈ నెల 24 నుంచి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 12న స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. అయితే సెలవుల్లో పాఠశాలలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.