జగన్ తీరుపై టీడీపీ ఎమ్మెల్యే మండిపాటు

76చూసినవారు
జగన్ తీరుపై టీడీపీ ఎమ్మెల్యే మండిపాటు
అధికారానికి 40 రోజులు దూరమైతేనే తట్టుకోలేకపోతున్నారా జగన్? అంటూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా ఆయన జగన్ తీరుపై మండిపడ్డారు. ‘మీ దోపిడీ పాలనకు విసుకు చెందే కదా ఏపీ ప్రజలు చరిత్ర ఎరుగని తీర్పునిచ్చారు. మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఆ ఘోర పరాభవాన్ని గుర్తు చేసుకుని కుమిలిపోతున్నారా? కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలైనా కాలేదు. మీ మానసిక స్థితిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి.’ అని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్