ఏపీలో టీడీపీ పగ్గాలు నారా లోకేష్ చేతుల్లోకి వెళ్తున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే బాబు ముఖ్యమంత్రిత్వంలో లోకేష్ సమర్ధ మంత్రిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ జనం మన్ననలు పొందిన తరువాత 2029 నాటికి ఆయనను సీఎం అభ్యర్ధిగా ప్రొజెక్ట్ చేయడంతో పాటు అప్పటికి ఆయనకు పార్టీ అధ్యక్ష పదవితో పట్టాభిషేకం చేస్తారని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.