CBT విధానంలో TET, DSC ప‌రీక్ష‌లు

62చూసినవారు
CBT విధానంలో TET, DSC ప‌రీక్ష‌లు
ఏపీ TET, DSC ప‌రీక్ష‌లను ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్ (CBT) విధానంలో నిర్వ‌హించనున్న‌ట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్ వెల్ల‌డించారు. రోజుకు రెండు సెషన్లలో ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని తెలిపారు. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంద‌ని చెప్పారు. పరీక్షల కోసం రాష్ట్రంలో 185, రాష్ట్రం బయట 22 కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్