ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ 2024) నోటిఫికేషన్ విడుదల అయ్యింది. పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం రాత్రి టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జులై 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి వివరాలను మరికొద్ది సేపట్లో https://aptet.apcfss.in లో పొందుపరచనున్నారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంది. ఇప్పటికే టెట్ సిలబస్ ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంది.