వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు అంటూ సీబీఐ ఆరోపిస్తున్న వ్యక్తి.. సీబీఐ ఛార్జ్షీట్లో పేరున్న వ్యక్తికి కడప టికెట్ ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారో ప్రజలకు జగన్ వివరించాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సొంత బాబాయి హత్య కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని జగన్ కడప లోక్సభ బరిలో నిలబెట్టడం తట్టుకోలేకపోయానని, అందుకే తానూ కూడా ఇక్కడి నుంచే బరిలోకి దిగానన్నారు.