ఏపీలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. తొలిసారి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఎలా పంపిణీ చేయవచ్చో నిరూపిస్తూ సచివాలయ సిబ్బంది ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేస్తోంది. ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఇవ్వలేరని ప్రచారం చేశారని, దాన్ని తప్పని నిరూపించడానికే సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పిస్తున్నట్లు పవన్ తెలిపారు.