పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన మంత్రి భార్యపై సీఎం సీరియస్‌

81చూసినవారు
పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన మంత్రి భార్యపై సీఎం సీరియస్‌
ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి పోలీసులతో ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులతో ఆమె మాట్లాడిన తీరును తప్పుబట్టారు. మంత్రి రామ్‌ప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఉపేక్షించబోనని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్