AP: మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడవద్దని ఏప్రిల్ 16న కడప కోర్టు ఆదేశాలివ్వగా.. దీనిపై ఏపీసీసీ చీఫ్ షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఆమె సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీనిపై ఇవాళ విచారణ జరగ్గా.. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.