ఏపీ రాజకీయాలకు సంబంధించి సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికర విషయం ఒకటి నెట్టింట వైరలవుతోంది. ఏపీలో జగన్ సర్కార్ గెలిస్తే.. ఈవీఎం ధ్వంసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఖరారయినట్లేనని జోరుగా ప్రచారం జరుగుతుంది. పార్టీ పెద్దలు ఇప్పటికే పిన్నెల్లికి సూచనలు అందించారని వార్తలు వినిపిస్తున్నాయి.