పట్టపగలే ఆలయంలో చోరీ (వీడియో)

76చూసినవారు
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పట్టపగలే చోరీ జరిగింది. బుధవారం ఉదయం ఆలయంలో పురాతన పంచలోహ ఉత్సవ విగ్రహం, ఇత్తడి పళ్లెం, ఇత్తడి గంటను దొంగలించారు. దుండగులు ఆలయంలోకి చొరబడి.. తాళాలు పగలగొట్టి చోరీ చేసినట్లు ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు సమాచారమిచ్చారు. అయితే ఆలయంలో 12 సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ, అవి పనిచేయనట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్