ఎంపీగా ఇవే తన చివరి ఎన్నికలు కావొచ్చంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "ఎంపీగా ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానేమో. ఈ సారి రాజంపేట ఎంపీగా గెలుస్తాను, వచ్చే ఎన్నిల్లో ఎంపీగా నిలబడతానో లేదో. రాబోయే ఎన్నికల్లో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించాలి." అని వ్యాఖ్యానించారు.