వాలంటీర్లపై టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజీనామాలు చేసి ఎవరైతే వైసీపీకి పని చేస్తారో వారే తమ వాలంటీర్లని చెప్పారు. ఇప్పుడు వైసీపీకి పని చేసే వాళ్లే జూన్లో మళ్లీ కొనసాగుతారని అన్నారు. "రాజీనామా చేయని వాళ్లు మనకి పని చేయరని అర్థం. ఇప్పటివరకు రాజీనామా చేయని వాలంటీర్లు తక్షణమే రాజీనామా చేయాలి. ఈ పది రోజులు ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలి." అని అల్టిమేటం ఇచ్చారు.