తిరుమల లడ్డూ వివాదం.. భారీగా పెరిగిన డిమాండ్!

81చూసినవారు
తిరుమల లడ్డూ వివాదం.. భారీగా పెరిగిన డిమాండ్!
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారన్న వార్తతో లడ్డూ విక్రయాలు తగ్గుతాయని అందరూ భావించారు. కానీ ఒక్కసారిగా తిరుమల లడ్డూకు భారీగా డిమాండ్ పెరిగిందని టీటీడీ వెల్లడించింది. లడ్డూ వివాదం విక్రయాలపై ప్రభావం చూపలేదని వెల్లడించింది. ఈ నెల 19న 3.59 లక్షలు, 20న 3.16 లక్షలు, 21న 3.66 లక్షల లడ్డూలను శ్రీవారి భక్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్