పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎంపిడిఓ
By Murali 73చూసినవారుపరిసరాలు పరిశుభ్రత అందరి బాధ్యతని పూతలపట్టు ఎంపీడీవో ప్రసన్నకుమారి బుధవారం తెలిపారు. పూతలపట్టు మండలంలో చేపడుతున్న పారిశుధ్య పనులను ఎంపీడీవో పరిశీలించారు. తాగునీటి ట్యాంకులు శుభ్రపరిచి క్లోరినేషన్ చేపట్టాలన్నారు. తాగునీటి కుళాయిల లీకేజీలను ఎప్పటికప్పుడు అరికట్టాలని సూచించారు. అంటువ్యాధి ప్రబలకుండా ప్రజలను చైతన్య పరచాలన్నారు.