ప్రమాదపు అంచున ప్రయాణం

54చూసినవారు
వరదయ్యపాలెం మండలంలోని గోవర్ధనపురం వద్ద ఉన్న పాముల కాలువ బ్రిడ్జికి మరమ్మతులు చేయాలని శనివారం స్థానికులు కోరుతున్నారు. పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో లారీలు, బస్సులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే బ్రిడ్జిపై గుంతలు ఏర్పడి ఇనుప చువ్వలు బయటికి వచ్చాయని, ప్రమాదకరంగా ఉన్నట్లు వారు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్