పార్టీకి పనిచేసిన కార్యకర్తలు నాయకులకు ప్రత్యేక స్థానం: నెలవల

70చూసినవారు
తెలుగుదేశం పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు, న్యాయకులకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని ఆ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. గురువారం నాయుడుపేట పట్టణంలోని తుమ్మూరులో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఎంత మంది వచ్చి శాలువతో సత్కరించిన పార్టీ కోసం తన వెంట నడిచిన వారికి గుర్తింపు ఉంటుందని ఎలాంటి అపోహలు వద్దన్నారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్