శ్రీకాకుళం జిల్లాలో విషాదం

65చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలో విషాదం
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం లంకపేటలో విషాదం చోటు చేసుకుంది. పొలం పనులకు వెళ్లి వస్తుండగా శనివారం గ్రామస్తులపై కందిరీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కందిరీగల కాటుకు గురైన వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్