జేసీబీ వాహనంపై ఏకదంతుని ఊరేగింపు (Video)

78చూసినవారు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయగూడం గ్రామంలో గ్రామస్తులు వెరైటీగా ఓ జేసీబీలో వినాయకుడిని పెట్టి ఊరంతా ఊరేగింపు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామస్తులంతా వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. జేసీబీ ఎదుట మహిళలు, యువకులు నృత్యాలు చేస్తూ గణేష్‌ని గ్రామంలోని వీధుల వెంట ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్