గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితులైన బొమ్మారెడ్డి వెంకట నరసింహారెడ్డి, కారుమంచి మహేష్లను సీఐ వరప్రసాద్ అరెస్ట్ చేశారు. నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం వారిని గన్నవరం సబ్ జైలుకు తరలించారు. కాగా, ఇప్పటివరకు ఈ కేసులో భాగంగా 15 మందిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.