ఏలూరు జిల్లా జీలుగుమిల్లి(M) తాటియాకులగూడెం వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి రశీదులు లేకుండా తరలిస్తున్న 50 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. ఆంధ్రా-తెలంగాణ అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదును వీఆర్వోల సమక్షంలో లెక్కించి.. ఐటీ కార్యాలయానికి తరలించనున్నట్టు సీఐ తెలిపారు.