AP: రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారన్న ప్రచారంపై ఎంపీ అయోధ్య రామిరెడ్డి మరోసారి స్పందించారు. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో నేడు గన్నవరం విమానాశ్రయానికి అయోధ్య రామిరెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజీనామా అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని రిపోర్టర్లు ప్రశ్నించగా.. అదంతా ఫేక్ అని ఆయన మీడియాకు స్పష్టం చేశారు.