సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలి

51చూసినవారు
ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని సోమవారం లోక్ సత్తా జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర్ ఒకప్రకటనలో కోరారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే తల్లికి వందనం, రైతులకు ఆర్థిక సాయం చేస్తామని హామీలు ఇచ్చినప్పటికీ ఆచరణలో అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. తల్లికి వందనం ప్రతి విద్యార్థికి రూ. 15వేలు, రైతుకు ఆర్థిక సాయం రూ. 20వేలు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని అన్నారు.

సంబంధిత పోస్ట్