టిడిపి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచిందని ఆ పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు వెల్లడించారు. నెల్లిమర్ల టిడిపి కార్యాలయంలో శుక్రవారం టిడిపి 42వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు నందమూరి తారకరామారావు విగ్రహానికి నాయకులు పూలమాల వేసి నివాళ్లర్పించారు. కర్రోతు మాట్లాడుతూ టిడిపి హయాంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిందని చెప్పారు.