ఆర్టీసీ లో ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

77చూసినవారు
ఆర్టీసీ లో ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
గురువారం విజయనగరం జిల్లా కోర్టు దగ్గర ఉన్న ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈడి జోన్ -2 రవికుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుబావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. దేశానికి త్యాగమూర్తుల చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివన్నారు.