ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యత తీసుకోవాలి

84చూసినవారు
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యత తీసుకోవాలి
బొబ్బిలి మండలం వెలగవలస గ్రామంలో వనమిత్ర కృష్ణదాస్ ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షిద్దాం అనే నినాదంతో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళ ముందు, ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వి. వెంకటేశ్వర్లు, మహిళలు, పిల్లలు, వృద్దులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్