ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గుర్రం జాషువా జయంతి ఉత్సవాలు

66చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గుర్రం జాషువా జయంతి ఉత్సవాలు
గజపతినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో శనివారం గుర్రం జాషువా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రావాడ సత్యనారాయణ అధ్యక్షతన, జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కులవివక్షను ఎదుర్కొంటూ సమసమాజ నిర్మాణానికి స్ఫూర్తి నిచ్చిన దళితాభ్యుదయవాది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాస రావు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్