ప్రజా సమస్యలపై పోరాడుదాం

81చూసినవారు
ప్రజా సమస్యలపై పోరాడుదాం అని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒమ్మి రమణ అన్నారు. గురువారం గజపతినగరంలోని నీళ్ల ట్యాంకు ఆవరణలో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ప్రత్యేక హోదాను టిడిపి జనసేన విస్మరించాయని ఆరోపించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు బుగత అశోక్, ఆనందరావు, సిపిఐ నేత పురం అప్పారావు, మండల శాఖ అధ్యక్షుడు గేదల రామనాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్