వైభవంగా వాసవిమాతకు లక్ష కుంకుమార్చన
గజపతినగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శనివారం వాసవిమాతకు లక్ష కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. కన్యకా పరమేశ్వరి పుట్టినరోజు పురస్కరించుకొని తెల్లవారుజామున క్షీరాభిషేకం, పంచామృత అభిషేకాలు అర్చకులు జరిపారు. అనంతరం లక్ష కుంక మార్చన కార్యక్రమం జరిగింది. మహిళలు వాసవి మాత గీతాలను ఆలపించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు.