పోషక విలువలు గల ఆహారం తీసుకోవాలి

50చూసినవారు
లబ్ధిదారులు పోషక విలువల గల ఆహారం తీసుకోవాలని జాయింట్ డైరెక్టర్ మనోరంజని కోరారు. శనివారం బొండపల్లి మండలంలోని గొట్లాం అంగన్వాడి 2 కేంద్రంలో పోషకాహార వక్షోత్సవ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. చిరుధాన్యాలు ఆకుకూరలు రోజు తీసుకునే ఆహారంలో తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రక్తహీనత గల గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలన్నారు. పిడి శాంతికుమారి, సర్పంచ్ ఆదిలక్ష్మి, వైసీపీ నేతలు తులసి, రమణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్