రైతుగా మారిన కలెక్టర్

71చూసినవారు
గుమ్మలక్ష్మీపురం మండలం గొరడ, ఆర్ జమ్మూ, కొండ బారెడు, వలసబల్లేరు గ్రామాల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులను కలిసి ముచ్చటించారు. అక్కడ సాగు చేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కొందరు రైతులు వరి నాట్లు వేస్తుండగా వారితో కలిసి ఆయన నాట్లు వేశారు. గిరిజనులతో రోజంతా గడపడం ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్