పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పార్వతీపురం పట్టణ శివారులో గల జంఝవతి కాలువలో పసికందు మృతదేహం ఆదివారం లభ్యమైంది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.