జొన్నాడ టోల్ ప్లాజాని ఎత్తివేయాలి

82చూసినవారు
జొన్నాడ టోల్ ప్లాజాను ఎత్తివేయాలని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ డిమాండ్ చేశారు. డెంకాడ మండలం జొన్నాడ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా వద్ద లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు బీశెట్టి బాబ్జితో కలిసి సోమవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్రీయ రహదారిపై టోల్ ప్లాజా ఏర్పాటు చేయడం దారుణమని అన్నారు. తక్షణమే టోల్ ప్లాజాని ఎత్తివేసివిధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్