ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పాలకొండ విచ్చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తొలుత విపి రాజుపేట జంక్షన్ వద్ద హెలికాఫ్టర్ దిగిన పవన్ కల్యాణ్ అక్కడి నుంచి రోడ్ షోలో వడమ జంక్షన్కు చేరుకున్నారు. అనంతరం అక్కడ జరిగిన సభలో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో అవినీతికి వైవి సుబ్బారెడ్డి, మిథిన్ రెడ్డిలు సూత్రదారులన్నారు. శ్రీకాకుళం యాస, భాష తనకు ఎంతో ఇష్టమన్న పవన్.. ఉత్తరాంధ్ర పాటలు పాడి ఆలరించారు.