కోట్లు దుబారా చేసిన వైసీపీ: పవన్

544చూసినవారు
కోట్లు దుబారా చేసిన వైసీపీ: పవన్
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మన్యం జిల్లా పాలకొండలో జనసేన అధినేత పవన్ గురువారం ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడానికి రూ. 1300 కోట్లు, తీసేయడానికి రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. వాటిలో రూ. 220 కోట్లతో తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ పూర్తి అయ్యేది అన్నారు. యువతను మండే నిప్పుకణికలుతో పోల్చారు. జగన్ లాంటి దోపిడీదారుల దాష్టీకంపై యువత పోరాడాలి అని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్