మన్యం జిల్లాలో చేతుల శుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. మంగళవారం అంగన్వాడీ కేంద్రంలో, పాఠశాలలలో చేతులు శుభ్రతపై చిన్నారులకు శిక్షణ ఇచ్చారు. తల్లిదండ్రులకు తగు సూచనలు ఇచ్చారు. శుభ్రత, వ్యక్తిగత పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. స్టాప్ డయేరియా కాంపెయిన్లో భాగంగా తాగు నీటి పరీక్షలతో సహా చేతుల శుభ్రతపై అంగన్వాడీ, పాఠశాల విద్యార్థుల్లో అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ ఆదేశించారు.