మెంటాడ గ్రామంలోని సోమవారం ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి రాకోటి రాములు మాట్లాడుతూ అంగన్వాడీలు వేతనాలు పెంచాలని, ఇతర సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. విజయవాడలో ఆందోళన జరిపేందుకు వెళ్లిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వారిని తక్షణమే విడిచిపెట్టి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు .