ప్రకృతి సాగులో బహుళ పంటలు

2372చూసినవారు
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ దుగ్గేరు, మూలవలస గ్రామాలలో గురువారం నవధాన్యాలు సాగు-నేలతల్లికి బాగు అనే కార్యక్రమం పై ర్యాలీ నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ సీఆర్పీ ఉర్లక నాగార్జున మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాలు చాలా ఉపయోగకరమైనవని, ఈ నవధాన్యాలు వేయడం వల్ల భూమిలో జీవవైవిధ్యం పెరిగి, ప్రధాన పంటకు కావలసిన సూక్ష్మ, స్థూల పోషకాలు అందుతాయన్నారు. అదేవిధంగా నేలలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుందని తెలిపారు. బహుళ పంటలు వేయడం వల్ల కలుపు నివారించవచ్చు, అదనపు ఆదాయం కూడా వస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్