జక్కువ గ్రామంలో శాశ్వత భూ సమస్యలు పరిష్కార కార్యక్రమం

579చూసినవారు
జక్కువ గ్రామంలో శాశ్వత భూ సమస్యలు పరిష్కార కార్యక్రమం
జక్కువ గ్రామంలో శనివారం సుమారు రూ.21 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆర్బీకేను ఉప ముఖ్యమంత్రి పిడిక రాజన్న దొర ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందుతాయని అన్నారు. అనంతరం గ్రామంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం, అసైన్మెంట్ భూములకు యాజమాన్యపు హక్కులు కల్పించి 22ఏ జాబితా నుంచి తొలగింపు, భూమిలేని నిరుపేదలకు అతుకుబడి భూములకు 104 ఎకరాలకు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్