రైతు భరోసా కేంద్రంలో విత్తన డీలర్లతో ప్రత్యేక సమావేశం

54చూసినవారు
మెంటాడ రైతు భరోసా కేంద్రంలో మండలంలో ఉన్న 14 మంది విత్తన డీలర్లు, ఎరువుల వ్యాపారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. మెంటాడ మండలంలో విత్తన డీలర్లు ఎరువుల వ్యాపారులు నిబంధనలకు లోబడి వ్యాపారం చేయాలని మండల వ్యవసాయ అధికారి గోకుల్ కృష్ణ కోరారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు పాల్పడినా చట్టరీత్యా శిక్షార్హులవుతారన్నారు.

సంబంధిత పోస్ట్