వేపాడ మండలం బక్కు నాయుడుపేటలో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో చెల్లిబోయిన దేముడు కళ్ళంలో పశువులు పాకకు అకస్మాత్తుగా నిప్పంటుకుంది. దీంతో అగ్నికీలలు పక్కనే ఉన్న గడ్డివాముకు అంటుకోవడంతో పశువుల పాక, గడ్డివాము పూర్తిగా దగ్ధమయ్యాయి. పశువుల పాకలో ఉన్న గేదకు తీవ్ర గాయాలు అయ్యాయని బాధితుడు దేముడు లబోదిబోమంటున్నాడు.