సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. అసోం, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఒక్కరు చొప్పున అధికారులపై వేటు వేసిన ఈసీ.. ఒడిషాలో 8, బిహార్లో 9 మంది అధికారులపై చర్యలు తీసుకుంది. అత్యధికంగా ఏపీలో 9 మంది అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది.