గోస్తనీ నదిలో గల్లంతయిన ఓ వ్యక్తి

78చూసినవారు
గోస్తనీ నదిలో గల్లంతయిన ఓ వ్యక్తి
జామి మండల కేంద్రానికి చెందిన కొత్తలి దేవుడు (65) గోస్తని నది వద్ద పశువులు మేపుతుండగా పశువులు ఒక్కసారిగా నదిలోకి దిగాయి. దీంతో దేవుడు నదిలోకి దిగి పశువులను బయటకు తరలించే క్రమంలో నదిలో గల గోతిలో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో సోమవారం గాలింపు చర్యలను కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్