కొత్తవలసలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

68చూసినవారు
కొత్తవలసలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కొత్తవలస మండలంలో గల శారద కంపెనీ బొగ్గు యార్డులో ఆదివారం సాయంత్రం ఓ గుర్తు తెలియని మృతదేహం పడి ఉండడంతో సమాచారం అందుకున్న డీఎం సిహెచ్ సన్యాసిరావు కొత్తవలస పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు సీఐ షణ్ముఖరావు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్