ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర పురోగతి చెందుతుందని విజయనగరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజలు మరలా కోరుకుంటున్నారని అన్నారు. కాగా డిప్యూటీ స్పీకర్ వైసిపి అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి పై 57 వేల 669 ఓట్ల భారీ మెజారిటీతో అదితి విజయం సాధించారు. ఇంత భారీ మెజారిటీ ఇచ్చి తనపై ప్రజలు ఇంకా బాధ్యత పెంచారన్నారు.