ఏపీలో పోలింగ్ రోజు, తర్వాత జరిగిన హింసపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర సీఎస్, డీజీపీ వివరణ తర్వాత.. వారు సూచించిన ఆరు ప్రతిపాదనలకు ఈసీ ఆమోదం తెలిపింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేయడంతో పాటు పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. ఆ మూడు జిల్లాల్లోని 12 మంది కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేసింది. వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.