పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పాడేరు జాయింట్ కలక్టర్

568చూసినవారు
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పాడేరు జాయింట్ కలక్టర్
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో పోలింగ్ కేంద్రాలను బుధవారం పాడేరు జాయింట్ కలక్టర్ భావనావశిష్ఠ పర్యవేక్షించారు. మండలంలోని మారుమూల, భూదరాళ్ల, మర్రివాడ, రాజేంద్రపాలేం, కొయ్యూరు, సింగవరం, చిట్టంపాడు, పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి విద్యుత్, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు కల్పనకై సంబంధిత అధికారులకు సూచించారు. జాయింట్ కలక్టర్ వెంట తహసీల్దారు రాజేశ్వరరావు, ఎటిడబ్ల్యూఒ క్రాంతి కుమార్, మంప, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్