కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సీఏఏపై ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. భారత యువతకే బీజేపీ ఉద్యోగాలు కల్పించడం లేదని కేజ్రీవాల్ విమర్శించారు. బీజేపీ మన పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వలేకపోతోందని, పాకిస్థాన్ కు చెందిన పిల్లలకు ఎలా ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటోందని ఆరోపించారు.